డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం. 8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం. 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశాం. హెరాయిన్ కేసుపై మరోసారి సీపీ క్లారిటీ.
డ్రాగ్ రాకెట్ ఢిల్లీ కేంద్ర కార్యకలాపాలు జరిపింది. విజయవాడ అడ్రస్ ను 2 సార్లు ఉపయోగించారు. నగరంలో రౌడిసీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. 18 మంది రౌడీ షీటర్స్ లను నగర బహిష్కరణ చేశాము. 116 మందిపై కొత్తగా షీట్స్ ఓపెన్ చేశాం. 3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టాం. కొండపల్లి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం..